హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టా అందుకున్నాడు. దీనిపై మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ.. “నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్. నీ కలల సాకారం కోసం కృషిచేస్తూ ఉండు. ఎప్పటికీ నిన్ను ప్రేమించేవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. ఓ తండ్రిగా ఇవాళ నేను పుత్రోత్సాహంతో గర్విస్తున్నాను” అని పోస్ట్ చేశారు.
Tags hyderabad
Check Also
విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …