Breaking News

పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టంలో ప్రజా ఫిర్యాదులకు సంతృప్తికర పరిష్కారాలు అందించండి

-ఇన్ఛార్జ్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గలసోమవారం ఉదయం ఇన్ఛార్జ్ కమాండర్ కంట్రోల్ రూమ్ నందు నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక), ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, వివిధ శాఖాధిపతుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం అని ప్రతి సోమవారం ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాల్లో తమ ఫిర్యాదులను తీసుకువచ్చి సత్వరమే పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు సంతృప్తికర పరిష్కారాలు అందించాలని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు అందగా. అందులో 3 ఇంజనీరింగ్ విభాగం, ఒకటి ప్రజారోగ్యం, 7 టౌన్ ప్లానింగ్, ఒకటి యు సి డి, ఒకటి రెవిన్యూ, ఒకటి ఎష్టబ్లిష్మేంట్ విభాగాలకు చెందిన ఫిర్యాదులు అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఏం ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీ రత్నావళి, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బి సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ రామ్మోహన్ రావు, ఎకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *