హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- ఆర్ఐఎన్ఎల్) ఈ రోజు సందర్శించారు. ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారంలోని కీలక ఉత్పత్తి యూనిట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత, ఆర్ఐఎన్ఎల్ సీనియర్ మేనేజర్లతో వివరణాత్మక చర్చలు జరిపారు, కర్మాగారం పనితీరును సమీక్షించారు. ఈ పరిశీలన అనంతరం కార్మికులతోనూ మంత్రి మాట్లాడారు. ఆర్ఐఎన్ఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్, సంయుక్త కార్యదర్శి సంజయ్ రాయ్, ఇతర సీనియర్ అధికార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags hyderabad
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …