Breaking News

అనంత్ అంబాని వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ముంబై, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద వివాహ వేడుకలలో ఒకటిగా నిలిచింది. జూలై 12 నుంచి ముంబైలో ప్రారంభమైన ఈ ఈవెంట్ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ అద్భుత ఘ‌ట‌న‌ను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చారు. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకున్నారు. అనంతరం జులై 13న శుభాశీస్సులు అందజేస్తున్నారు. ఈ జంటను ఆశీర్వదించేందుకు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై ఆశీర్వదించారు. వీరితో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. మంగళ్ ఉత్సవ్ జూలై 14న గ్రాండ్ రిసెప్షన్‌తో ముగుస్తుంది. అనంత్ రాధికా వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సినీ తారలు హాజరయ్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *