Breaking News

ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ లేబర్ బడ్జెట్ ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అయన చెప్పారు. లేబర్ బడ్జెట్ మొదటి విడతగా 15 కోట్ల పని దినాలు మంజూరు చేయగా అవి జూన్ నెలాఖరుకే పూర్తయ్యినందున అదనపు పని దినాల కోసం ఈ ప్రతిపాదనలు పంపామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు అంటే మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  అదే విధంగా ఇప్పటి వరకు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను సత్వర విడుదలకు సమ్మతించారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *