Breaking News

ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి

-ఆగస్టు నెలకు 64.82లక్షల ఫించన్లకు రూ.2737.41 కోట్లు విడుదల
-1వతేదీనే 96శాతం పంపిణీ,2వ తేదీతో నూరు శాతం ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలి
-ఫించన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలి
-ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి
-గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గం.లకే ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 1వతేదీనే 96శాతం పైగా ఫించన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగష్టు నెలకు సంబంధించి 64 లక్షల 82 వేల 52 వివిధ రకాల ఫించన్ల పంపిణీకి రూ.2737.41 కోట్లను విడుదల చేయడం జరిగిందని ఈమొత్తాన్నిబుధవారం మధ్యాహ్నం లోగా డ్రా చేసేందుకు ఎల్డియంలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు స్పష్టం చేశారు.గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది 1వతేదీ ఇంటింటా వెళ్ళి 96 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని,2వతేదీన నూరు శాతం ఫించన్ల పంపిణీనీ పూర్తి చేయాలని ఆదేశించారు.ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఫించన్ల పంపిణీకి సంబంధించి జూలై నెలలో పశ్చిమ గోదావరి,కడప,అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.ఆసంఘటనలకు సంబంధించి బాధ్యులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని విధుల నుండి సస్పెండ్ చేసినందున తదపురి క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిఎస్ స్పష్టం చేశారు.
వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఫించన్ల పంపిణీకి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే జిల్లా కలక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. జూలై మాసంలో ఫించన్ల పంపిణీకి సంబంధించి సర్వర్ డౌన్ కావడంతో ఆధార్ అధంటికేషన్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వాటిని అధికమించేందుకు యుఐడిఎఐ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సమావేశంలో సెర్ప్ సిఇఓ జి.వీరపాండ్యన్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్, జిల్లా కలక్టర్లు, డిఆర్డిఏ పిడిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *