Breaking News

జేసీగా చిన రాముడు బుధవారం బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. తొలిగా స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి , జాయింట్ కలెక్టర్ చిన రాముడు తో జిల్లాలోని ప్రాధాన్యత అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం చేరుకున్న చిన రాముడు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఆయన జేసీగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు కలెక్టర్ సిబ్బంది ఇతర శాఖల అధికారులు చిన రాముడు ను కలిసి అభినందనలు తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *