Breaking News

వరద ప్రభావిత ప్రాంతాల్లో 100% పునరుద్ధరించిన కుళాయి నీటి సరఫరా

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల్లో, విజయవాడ నగర పాలక సంస్థ ద్వారా సరఫరా అవుతున్న 77540 కుళాయి నీటిని కనెక్షన్లను 100% పునరుద్ధరించినట్టు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో 77,550 కుళాయి నీటి కనెక్షన్ ను విజయవాడ నగరపాలక సంస్థ 100% పునరుద్ధరించినప్పటికీ ప్రజలందరూ కేవలం వాడుటకు మాత్రమే వినియోగించాలని త్రాగటానికి కుళాయి ద్వారా వచ్చే నీటిని వాడవద్దని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్రాగటానికి 229 ట్యాంకర్లతో ప్రతిరోజు 25 లక్షల లీటర్ల త్రాగునీటి సరఫరాను చేస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలు కేవలం టాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న సురక్షిత త్రాగునీటి నీ వినియోగించాలని కుళాయి ద్వారా వస్తున్న నీటిని వాడుటకు మాత్రమే వినియోగించాలని కోరారు. ఈ సమాచారాన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన సర్కిల్ వన్ పరిధిలోని కేఎల్ రావు నగర్, ఊర్మిళ నగర్, నిజాంగేట్, కబేలా, ఐరన్ యార్డ్, హెచ్ బి కాలనీ, సర్కిల్ టు పరిధిలో ఉన్న సింగ్ నగర్, వాంబే కాలనీ, నందమూరి నగర్,శాంతినగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట లోని ప్రజలందరూ ఈ నీళ్లను త్రాగుటకు కాకుండా కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *