Breaking News

ఉత్తమ ఇంజనీర్ అవార్డు కు 2024 రాజా గౌతమ్ ఎంపిక…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతరత్న సర్ డాక్టర్ మోక్షగుండా విఘ్నేశ్వర జన్మదినం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. పద్మావతి మహిళ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఆధునిక నిర్మాణ రంగంలో సాంకేతిక సూచనలు అన్న అంశంపై రాజా గౌతమ్ ను అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డును IIT తిరుపతి సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ డీన్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ ఎ. మురళీకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.

అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది : బి. ఎన్. రాజు
బుద్దా ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ కన్స్టెక్ట్స్ ఇంజనీర్ రాజా గౌతమ్ ఉత్తమ ఇంజనీర్ 2024 అవార్డుకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని అలాగే ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచేందుకు దోహద పడుతుంది. అని అలాగే నిర్మాణరంగం సుస్థిర అభివృద్ధి సాధించాలని. వాతావరణ మార్పుల వలన తుఫానులు,వరదలు, ప్రమాద స్థాయిలో వచ్చే అవకాశాలు రానున్న రోజుల్లో ఉండవచ్చు పకృతి వైపరీత్యాలకు తట్టుకునే విధంగా డిజైన్లు రూపొందించే విధంగా ఇంజనీర్స్ తయారు చేయాలి అన్నారు . నాణ్యత విషయంలో ఇంజనీర్స్ శ్రద్ధ చూపాలని బి.ఎన్ రాజు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *