Breaking News

శెట్టిపల్లి భూములు స్థలాల పెండింగ్ సమస్యల త్వరితగతిన పరిష్కారానికి చర్యలు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శెట్టిపల్లి భూముల, స్థలాల సమస్య పరిష్కార దిశగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జేసీ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య లతో కలిసి సంబంధిత రెవెన్యూ అధికారులు, మునిసిపల్ ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు, శెట్టిపల్లి సాధన సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శెట్టిపల్లి భూములు స్థలాల పెండింగ్ సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. మూడు వారాలు లోపు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే శెట్టిపల్లి సాధన కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చిస్తూ త్వరిత గతిన సదరు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా ఈ కార్యక్రమం కొరకు కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, తుడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తిరుపతి అర్బన్ తాశిల్డార్ భాగ్యలక్ష్మి, డిటి అశోక్ రెడ్డి, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *