Breaking News

సుజనా చౌదరి ఔదార్యం

-మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 34 వ డివిజన్ కేదారేశ్వరపేటలో అనారోగ్యంతో మరణించిన అబ్బా బత్తుల విటల్ రావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మట్టి ఖర్చుల నిమిత్తం సాయం చేసి తమని ఆదుకోవాలని విటల్ రావు భార్య జగదీశ్వరి ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు జగదీశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *