Breaking News

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం

-యువగళంలో ఇచ్చిన హామీని అమలు చేయడంపై మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ సైనికులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై వారు హర్షం వ్యక్తం చేశారు. యువగళంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతూ.. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సైనికులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సైనికులకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో.. కూటమి నేతలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారంటూ అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. జీవోనెంబర్ 57, 191 లను కూడా ప్రభుత్వం అమలు చేసి తమకు మేలు చేయాలన్నారు. జీవో నెంబర్ 357 ప్రకారం ప్రభుత్వం నియమించే నియామకాల్లో 2% ఉద్యోగాలను మాజీ సైనికులకు కేటాయించినా దాన్ని అమలు చేయలేదని.. దాన్ని కూడా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సైనికుల సమస్యలను అసలు పట్టించుకోలేదన్నారు. మాజీ సైనికులకు హక్కుగా వస్తున్న జాబులను తమకు అందేలా చూడాలన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2లలో 2% రిజర్వేషన్ ను 5 శాతంకు, గ్రూప్ 3, గ్రూప్ 4 లలో 10% శాతంకు పెంచాలని వారు అభ్యర్థించారు. మాజీ సైనికులందరిని ఓసీలుగా పరిగణిస్తున్నారని.. అన్ని కులాల వారు అందులో ఉన్నా ఓసీ లుగా పరిగణించడంతో మాజీ సైనికులకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కడంలేదన్నారు. కావున మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు, జనరల్‌ సెక్రటరీ వై. రమేష్‌కుమార్‌, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన మాజీ సైనిక ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

 

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *