Breaking News

అధికారుల సంయుక్త పరిశీలన తో ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో సంయుక్త పరిశీలన చేస్తేనే ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. శాఖధిపతుల సమన్వయంతో ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయడం వల్ల వ్యర్ధాలు, సి అండ్ డి వేస్ట్, తొలగించుట, త్రాగునీటి పైప్లైన్ల మరమ్మతులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు సత్వరమే పరిష్కరించవచ్చని అన్నారు. అలాగే ప్రతి సచివాలయం పరిధిలో కూడా పట్టణ ప్రణాళిక సానిటరీ మరియు ఎమినిటీస్ సెక్రటరీలు ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేసి ప్రజల సమస్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *