Breaking News

పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగాఏ.ఆర్. గ్రౌండ్స్ నందు రెండు రోజుల పాటు ఓపెన్ హౌస్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అరాచక శక్తుల అణచివేసే క్రమంలో విధి నిర్వహణలో అశువులు బాసిన అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగనిరతికి చిహ్నంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విధి నిర్వహణలో పోలీసు వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమాజ సేవలో ధైర్యసాహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమర వీరుల అత్యున్నత త్యాగనిరతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన “పోలీసు అమర వీరుల సంస్మరణ దినం” జరుపుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ది. 21.10.2024వ తేదీ నుండి ది.31.10.2024వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను వివిధ అంశాలపై రూపొందించిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం వారోత్సవాలలో భాగంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలోని సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ గ్రౌండ్ నందు ది.26.10.2024వ తేదీ నుండి 27.10.2024వ తేదీ వరకు రెండు రోజులు పాటు ఓపెన్ హౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ది.26.10.2023వ తేదీన ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్, ముఖ్యఅతిదిగా విచ్చేసి పావురాలను, బెలూన్లను ఎగరవేసి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభిండచం జరిగింది.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. అక్టోబర్ 21వ తేదీకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమర వీరులను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున, సిటీ పోలీశాఖ తరుపున ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆర్ముడ్ రిజర్వ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరిగిందని, ఈ ఓపెన్ హౌస్ యొక్క ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే పోలీస్ శాఖలో అధునిక పద్ధతిలో ఉపయోగిస్తున్న ఆయుధాలు, సైబర్ క్రైమ్ నేరాలను ఏవిధంగా చేదిస్తున్నాము. తీవ్రవాదులు, మావోయిస్ట్ లను ఎదుర్కొనుటలొ ఏవిధమైన సాధనాలు, అయుధాలను పోలీసు వారు ఉపయోగించి ముందుకు వెళ్ళుతున్నాము అనేది సమాజంలోని ప్రజలకు, యువతకు, విద్యార్థులకు తెలియజేసి అవగాహన కలిగించడం జరుగుతుందని, ఓపెన్ హౌస్ కింద పోలీసు ఆయుధాలు, వాహనాలను ప్రదర్శించడం జరుగుతుందని, ఆక్టోపస్ దేశంలోనే ప్రధాన కమాండో టీం గా మనకు ఉందని, NDRF, SDRF ఆయుధాలను కూడా నేడు ప్రదర్శనలో ఉంచడం జరిగిందని, సిటీ సెక్యూరిటీ వింగ్ కు సంబంధించిన పరికరాలు, ఫింగర్ ప్రింట్ బ్యూరో విధానాన్ని వివరించడం జరుగుతుందని, పోలీసుల పని తీరు, ఆయుధాల గురించి విద్యార్దులకు అవగాహన కలిగిస్తున్నాం,నేరం జరిగిన చోట ఫింగర్ ప్రింట్ , ఇతర సాక్ష్యాలు ఎంతో కీలకం.. పోలీసులు ఎలా సేకరిస్తారో, క్రైం సీన్ లో పోలీసింగ్ ఎలా ఉంటుందో వివరించడం జరుగుతుంది. సైబర్ నేరాలపై ప్రత్యేకంగా చైతన్యం తీసుకువచ్చే విధంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వాటర్ కెనాన్, వజ్రా, ఫైర్ వాహనాల పని తీరుని ప్రదర్శించడం, మొబైల్ కమాండ్ కంట్రోల్ రూం పని తీరు కూడా అందరికీ వివరించడం, ఈ ఓపెన్ హౌస్ ద్వారా పోలీసు విభాగాల్లో సిబ్బంది పని తీరును అందరికీ తెలియపరిచడం వలన పోలీసు శాఖ ఏవిధంగా పని చేస్తుందీ, పని తీరు ఎలా ఉంటుందో భావితరాలకు వివరించడం జరుగుతుందని, ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని కావునా అందురు వీక్షించవచ్చు అని పత్రికా ముఖంగా తెలిపినారు.

సిటీ ఆర్మ్ రిజర్వ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన ఓపెన్ హౌస్ లో ఆక్టోపస్ బృందాలు ఉపయోగించు సాధనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, బి.డి. (బాంబ్ నిర్వీర్యం) బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, బాడీ వాన్ కెమెరాలు, వివిధ రకాల ఆయుధాల పనితీరు, ఎన్.డి.ఆర్.ఎఫ్.,, ఏ.పి.ఎస్.డి.ఆర్.ఎఫ్., సిటీ సెక్యూరిటీ వింగ్, కమ్యునికేషన్, సైబర్ క్రైమ్, క్రైమ్ స్పాట్, ట్రాఫిక్ గురించి మరియు వాటర్ కెనాన్, వజ్ర, ఫలకాన్ తదితర వాహనాల పాత్ర మరియు పని తీరు గురించి పాఠశాల మరియు కళాశాలల విద్యార్ధులకు సిబ్బందితో సమగ్రంగా వివరించి, అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి విద్యార్థులను అలరించింది.

ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమీషనర్ తోపాటు డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్, తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్.,  కృష్ణమూర్తి నాయుడు, సి.ఎస్.డబ్ల్యూ. డి.సి.పి.లు ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్., ఎస్.వి.డి.ప్రసాద్, ఏ.డి.సి.పి.లు ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐ.లు, ఆర్.ఎస్.ఐలు, సిబ్బంది మరియు వివిధ పాఠశాలల మరియు కళాశాలలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *