Breaking News

తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి ఇద్దరు మృతి చెందడం దిగ్భ్రాంతికరం

-హోంమంత్రి వంగలపూడి అనిత
-బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం: హోంమంత్రి
-విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామ శివారులోని బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు మృతి చెందడం విషాదకరమన్నారు. మృతి చెందిన కుటుంబాలకు హోం మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తీవ్రగాయాలపాలై తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఐదుగురు మహిళలకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని హోంమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రాంతాలకు ముందుగా సందేశం, ఫోన్ కాల్స్ చేసి అప్రమత్తం చేసే విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *