Breaking News

Tag Archives: amaravathi

కరోనా సెకండ్ వేవ్ – మన ఆరోగ్యం మన చేతుల్లోనే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతంలో కంటే సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి మరింత వేగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. గుంపులు గుంపులుగా తిరగకూడదు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. మన ఇంటి నుంచే మొదలవ్వాలి… కరోనా …

Read More »

డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవడంలో వారం పది రోజులు ఆలస్యమైనా పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. సాధారణంగా మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి డోసు ఏ కంపెనీ టీకా అయితే వేసుకుంటామో.. రెండో డోసు కూడా విధిగా అదే కంపెనీ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవద్దు. ఆ అవసరం కూడా ఉండదు. టీకా వేయించుకునే ముందు చాలా మంది కోవిడ్‌ పరీక్షలు చేయిస్తున్నారు. నిజానికి …

Read More »

వేలిముద్రలు, ఐరిస్‌ యంత్రాలతో కరోనా సోకే ప్రమాదంవుంది జాగ్రత్త… 

నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్‌ సేవా కేంద్రాలు కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. వేలిముద్రలు, ఐరిస్‌ను పరిశీలించే స్కానర్లు ఇందుకు దోహదపడుతున్నాయి. మీసేవా, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాలు నడిపించే సిబ్బంది నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కొవిడ్‌కు గురవుతుండటమే ఇందుకు నిదర్శనం. వినియోగదారులు సైతం ప్రభావితమవుతున్నారు. రక్షణ చర్యల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతోంది. వేలి ముద్రల సమస్యతో ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వృద్ధులు, కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునే చిన్నారులు మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read More »

కరోనాకు ఇంజెక్షన్ బదులు టాబ్లెట్​…

-చివరి దశకు చేరుకున్న ట్రయల్స్ నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారితో సీరియస్​ అవుతున్న పేషెంట్లకు ఇప్పుడు రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లతో ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దానిని టాబ్లెట్ల రూపంలో ఇచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరో ‘టాబ్లెట్​’ కరోనాను తగ్గిస్తోందట. ఇప్పటికే ఫ్లూ కోసం వాడుతున్న మోల్నుపిరావిర్​ (ఎంకే 4482) అనే మందు హామ్​స్టర్స్​ (ఓ రకం ఎలుకలు) పై బాగా పనిచేస్తోందట. అమెరికాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్ (ఎన్​ఐహెచ్​) కు చెందిన సైంటిస్టులు ఎలుకలకు ఈ మందులిచ్చి చూడగా …

Read More »

“సమ్మర్ లో ఈ ‘బియ్యం’ తినండి” 

నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో సగ్గు జావ తాగితే చాలా మంచిది. ఎందుకంటే సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సగ్గు బియ్యంలోని పొటాషియం రక్త ప్రసరణను సాఫీగా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. సగ్గు బియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముకలకు బలం పెరుగుతుంది.

Read More »

శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా …

Read More »

అబ్బురపరిచే తెల్ల చిలకడదుంప…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిలకడదుంప ఎంత బరువు ఉంటుందండీ… మాములుగా అయితే కిలోకు ఐదారు తూగుతాయి. బాగా పెద్ద సైజ్ అయితే ఒక్కోటీ కేజీ అవుతుంది. కానీ ఈ చిలకడదుంప ఒక్కసారి చూడండి. ఏకంగా ఆరు కిలోలు బరువు పెరిగింది. అబ్బో ఎంత పెద్ద చిలకడ దుంపో అని అబ్బురపరిచేలా పెరిగింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంకు చెందిన రైతు గంజాల స్వాములు తన మామిడితోటలో గూడూరు మల్లవోలు నుంచి తెల్ల చిలకడదుంప విత్తనాలు తెచ్చి అంతర్ పంటగా సాగు చేశాడు. …

Read More »

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే…

నేటి పత్రిక ప్రజావార్త : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే అని చెప్పడానికి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అయన నటుడుగా, నిర్మాత, దర్శకుడిగా సాంకేతికపరంగా అందించిన ఎన్నో ప్రయోగాలే  నిదర్శనం. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. తన కెరీర్ లో సుమారు 350 సినిమాలలో హీరో గా నటించి పరిశ్రమలో తన సత్తా చాటుకున్నాడు. నిర్మాత, దర్శకుడిగా కూడా కృష్ణ …

Read More »

శివయ్య  కృపకు పాత్రులుకండి…

  -పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ    నేటి పత్రిక ప్రజావార్త : ఓం శ్రీ గురు మాత్రే నమః కాశీ విశాలాక్షీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి యే నమః భారతీయ సనాతన ఆర్ష హిందూ ధర్మ  పరిరక్షణ సేవలో భాగంగా, పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ గత కార్తీకమాసంలో 30 రోజులు మహాదేవుడు  ఆదిదేవుడు బోలా శంకరుడు సదాశివుడు విశ్వేశ్వరుడు కొలువైన కాశీ మహా క్షేత్రంలో భక్తుల గోత్ర నామాలతో అభిషేకం అర్చనలు జరిపించారు. కాశీ …

Read More »

వేసవిలో ఏసీలకు ధరల సెగ…

నేటి పత్రిక ప్రజావార్త : వేసవి వచ్చిందంటే ఎవరైనా చల్లని ఏసీ గాలులతో సేద దీరాలనుకుంటారు. కాని ఈ ఏడాది ఏసీలు కొనుగోలుదారులకు వేడి పెంచనున్నాయి. ఏసీల విక్రయానికి పలు కంపెనీలు సన్నాహాలు చేసుకుంటూనే వాటి తయారీలో ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది ఏసీల ధర 5-8 శాతం మధ్యన పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ధరలు పెంచినా ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసం కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తత మహమ్మారి నేపథ్యంలో సమాజంలో పెరిగిన …

Read More »