తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ చేస్తారు విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
Read More »Tag Archives: tirumala
గరుడ వాహనంపై కలియుగ ప్రత్యక్షదైవం
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు. వేంకటగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. సాక్షాత్తు వేంకటనాథుడే తన అనుంగు వాహనంపై తమను దీవించేందుకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సేవలో మూల విరాట్ని అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీవేంకటేశ్వర సహస్రమాల… తదితర వెలకట్టలేని ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించడం విశేషం. గరుడునిపై మలయప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. సౌపర్ణుడు …
Read More »శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2024
-శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ కార్య నిర్వహణాధికారి శ్యామల రావు అదనపు ఈఓ …
Read More »2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన
-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన శుక్రవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 1.25 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద …
Read More »బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
– శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – అక్టోబరు 4న ధ్వజారోహణంనాడు ముఖ్యమంత్రివర్యులు పట్టువస్త్రాల సమర్పణ – వాహనసేవల వైశిష్ట్యం ఇలా… తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్టోబరు …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా.ఎల్. మురుగన్.
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ప్రాయశ్చిత్త దీక్ష విరమణ -స్వామి వారికి ప్రత్యేక పూజలు.. -వారాహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ఉంచిన పవన్ కళ్యాణ్ -మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరణ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన …
Read More »కాలినడకన తిరుమలకు పవన్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలేశుని మొక్కుబడి తీర్చుకోవాలనే పట్టుదలతో పట్టిన దీక్ష లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలిపిరి నడక దారిలో బయలుదేరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ వైఫల్యాల ప్రభావం రాష్ట్ర ప్రజల పై పడకూడడనే సదుద్దేశ్యంతో పవన్ వారం రోజుల క్రితం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. చివరిరోజున తిరుమల లో తన దీక్ష ను విరమిస్తానని ప్రకటించారు. ఆ ప్రకారం మంగళవారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకొని రాత్రి …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మరియు కమిషన్ సభ్యులు
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు మరియు కమిషన్ సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్థంభంనకు మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపం నందు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ తో పాటు కమిషన్ సభ్యులు …
Read More »బాలకార్మిక ,భిక్షాటన రహిత తిరుమల గా తీర్చదిద్దుదాం… : రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో బాలకార్మికులు, భిక్షాటన లేకుండా సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, సభ్యులు ట్రిపర్ణ ఆదిలక్ష్మి మరియు బత్తుల పద్మావతి పేర్కొన్నారు. తిరుమలలో ముఖ్యమైన వీధుల్లో దుకాణాల్లో,హోటల్స్ లో బాలకార్మికులను మరియు భిక్షాటన చేస్తూ ఉన్న బాలలను గుర్తించడం వారి ఈ పరిస్థితులకు గల కారణాలపై ఆరా తీయడం జరిగింది. వీరిలో ఎక్కువుగా తమిళనాడు కొంతమంది కర్ణాటక మరియు ఒడిస్సా నుండి …
Read More »