గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలో దీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించని వారి నివాస గృహాలు మరియు వ్యాపార సంస్థలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సుమారు 36 నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్ను బకాయిలపై ఇప్పటికే నోటీసులు, స్లిప్స్ పంపిణీ, మెసేజ్ లు పంపి అవగాహన కల్గించినా కొందరు చెల్లించడంలేదన్నారు. ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్న, వాటర్ మీటర్ చార్జీలు మరియు ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. పన్ను బకాయిలు చెల్లించని వారి ట్యాప్ కనెక్షన్ల తో పాటు డ్రైనేజి కనెక్షన్ తొలగిస్తామని, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
Prajavartha Online Telugu News