Breaking News

ఇంతవరకు 3.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు… : జెసి డా. కె. మాధవీలత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 34,051 రైతుల నుంచి 3,95,738 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 10మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34,051 మంది రైతుల నుంచి రూ. 691.34 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే రూ. 491.98 కోట్లను రైతులకు చెల్లించగా మరో రూ. 199.36 కోట్లను రైతులకు చెల్లించేందుకు అమోదించడం జరిగిందని త్వరలో సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయబడుతుందన్నారు. రైతులందరు తాము పండించిన రబీ ధాన్యమును ఇంకనూ విక్రయించవలసి యున్న యెడల ఈనెల జూలై 25 లోగా సత్వరమే సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో తమ ధాన్యమును విక్రయించవలసిందిగా జెసి కోరారు. విజయవాడ రూరల్ మండలం నుంచి శ్రీనివాసరావు తనకు నగదు జమ కాలేదని తెలపగా దీనిపై జెసి మాధవిలత స్పందిస్తూ జూలై 20వ తేదీన సదరు సొమ్ము సదరు రైతు బ్యాంకు ఖాతాలో జమ అయిందని తెలియజేశారు.
మైలవరం పెనుగంచిపోలు, పెడన, ముదినేపల్లి , బంటుమిల్లి, పెనమలూరు జగయ్యపేట, మండలాల నుంచి పలువురు రైతులు మాట్లాడుతూ తాము విక్రయించిన ధాన్యానికి వెంటనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోమని కోరారు. దీనిపై జేసి స్పందిస్తూ త్వరలోనే సంబంధిత సొమ్ము జమ చేయడం జరుగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ కె. రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *