గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ జెండా ఎగరవేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశహితం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సమాజానికి న్యాయం, గౌరవం, అభివృద్ధి అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ భారత్ సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రం–దేశం అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో దేశ బలానికి, సమాజ ఐక్యతకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News