రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల (హెచ్ఆర్సీ) ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు లకు జిల్లా కలెక్టర్ డా. మాధవీలత , జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందజేశారు. తొలుత జస్టిస్ మాందాత సీతారామ మూర్తీ ని అతిధి గృహంలో అదనపు ఎస్పీ రజని కుమారి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెమ్ అందచేశారు.
Prajavartha Online Telugu News