విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిట్టి మహిళా సభ్యుల సహకారంతో వరద బాధితులకు ఉచిత వైద్య చికిత్స శిబిరం గమేలా కాలనీ, ఆటోనగర్ లో బుధవారం జరిగింది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఆటోనగర్ నందు గల రోడ్డు నందు వరద బాధితులకు ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువమంది వైరల్ జ్వరాలు, దగ్గు జలుబు, అలెర్జీస్ తో బాధపడుతున్నారని వీరందరికి బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, డాక్టర్ మనోజ్, డాక్టర్ సృజన, రూట్స్ సభ్యులు ఎ.ఎస్.ఆర్.శర్మ, ఎలమందయ్య, విజయలక్ష్మి మరియు మందులు అందచేసిన ఉమెన్ కిట్టి సభ్యులు రత్నమణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …