Breaking News

Daily Archives: July 15, 2024

పరిష్కారంలో అలసత్వాన్ని సహించను – బాధ్యతగా విధులు నిర్వర్తించండి. సమస్యకు పరిష్కారం చూపండి

-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని బాధ్యతతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారులు ప్రజలకు జవాబుదారులుగా వ్యవహరించినప్పుడే లక్ష్యాలు సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సోమవారం జిల్లా కలెక్టర్ డా.జి. సృజన పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ విధులు నిర్వర్తించడంలోనూ ప్రజల సమస్యల పరిష్కారంలోను అలసత్వం ప్రదర్శించే …

Read More »

జిల్లాలో విజయవంతంగా జలశక్తి అభియాన్‌…

-ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపడుతున్నాం… -ఈఏడాది 60 కోట్ల 58 లక్షల వ్యయంతో 4,804 పనుల పురోగతి… -2023 లో రికార్డ్‌ స్థాయిలో పనులు చేశాం… -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి సంరక్షణ, నీటి పారుదల సామర్థ్యాని ప్రోత్సహించే లక్ష్యంతో జిల్లాలో చేపడుతున్న జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌, జిల్లా కార్యక్రమ సమన్వయ అధికారి జి. సృజన అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం జలశక్తి అభియాన్‌ …

Read More »

గత ప్రభుత్వ పాలనలో పోలవరం విధ్వంసం

-గత ఐదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి.. -2019లో ప్రభుత్వం మారడమే పోలవరం ప్రాజెక్టుకు శాపం.. -సాగు, తాగునీటి రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. -పోలవరం పర్యటన, వరుస సమీక్షలు చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం.. -నదుల అనుసంధానానికి, రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎనలేని కృషి.. -ఇకపై ఏటా పద్మభూషణ్ డా.కె.ఎల్.రావు, సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం, శ్రీరామకృష్ణయ్య జయంతోత్సవాలు.. -డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో …

Read More »

జౌళి పరిశ్రమకు బకాయిల విడుదలకు కృషి

-పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత -అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం -రాష్ట్రంలోని అన్ని వ్యవస్ధలను బ్రస్టు పట్టించిన జగన్ మోహన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జౌళి పరిశ్రమకు గత ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల విడుదల చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత హామీ ఇచ్చారు. కల్తీ కాటన్ నివారణకు వివిధ శాఖలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని …

Read More »

అటల్ టింకరింగ్ ల్యాబ్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  -అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ పాఠశాలలను సందర్శించిన జమ్మూ కశ్మీర్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల విద్యాశాఖ ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అలవర్చడమే కాకుండా జీవన విధానాలు కూడా నేర్పిస్తున్నామని, వీటిద్వారా సమర్థవంతమైన విద్యను అందించవచ్చని జమ్ము-కశ్మీర్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, యూనిసెఫ్ ప్రతినిధులను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  అన్నారు. సోమవారం …

Read More »

2030 నాటికి $4 బిలియన్ల MRO పరిశ్రమతో అగ్రగామి ఏవియేషన్ హబ్‌గా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది

-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు -గ్లోబల్ ఏవియేషన్ హబ్ హోదా కోసం ఉద్దేశించిన దేశీయ MRO పరిశ్రమను పెంచడానికి భారతదేశం విమాన భాగాలపై ఏకరీతి 5% IGSTని అమలు చేస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్ని విమానాలు మరియు విమాన ఇంజిన్ భాగాలపై 5% ఏకరీతి IGST రేటును అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది జూలై 15, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం దేశీయ నిర్వహణ, మరమ్మత్తు …

Read More »

మా ఎమ్మెల్యే ధర్మదాత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం బిజెపి కార్యాలయంలో రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సృజనా చౌదరి చేతుల మీదుగా జరిగినది ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలకు ఆర్థిక పరిపుష్టి స్వాలంబనకు పదివేల కుట్టు మిషన్ల పంపిణీ తో పాటు కుట్టు మిషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ కేంద్రాలలో స్వచ్ఛంద సంస్థల వారు పంపిణీ చేసే సేవా కార్యక్రమాల …

Read More »

రోడ్డు భద్రత- మన బాధ్యత

-రోడ్డు భద్రతపై అవగాహనతో వాహనాలు నడపాలి -డ్రైవింగ్ పట్ల నైపుణ్యత కలిగి ఉండాలి -రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవింగ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలని అప్పుడే సమర్ధవంతమైన డ్రైవింగ్ చెయ్యగలరని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు అన్నారు. కంచికచర్ల హైవే రోడ్డులో గల శ్రీ అన్నపూర్ణ హెవీ మోటర్ డ్రైవింగ్ స్కూల్ నందు సోమవారంనాడు హెవీ వాహనాలపై శిక్షణలు పొందుతున్న …

Read More »

గత ప్రభుత్వం జిపియస్ అమలుపై ఇచ్చిన జిఓ ను నిలుపుదల చేయాలని సియం ఆదేశాలపట్ల ఏపిజేఏసి అమరావతి హర్షం

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం, వారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపియస్ ను రద్దు చేస్తామని హామి ఇచ్ఛి ఐదేళ్లు పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఏపీ జేఏసీ అమరావతి 92 రోజుల ఉద్యమం తర్వాత, ప్రభుత్వ కాలపరిమితి పూర్తవుతున్న సమయంలో “అప్పట్లో అవగాహనలేక సిపియస్ రద్దు చేస్తామని హామి ఇచ్చామని”, అది ప్రస్తుతం సాద్యం కాదని చెప్పి, గత ప్రభుత్వం బలవంతంగా జిపియస్ ను ప్రవేశపెట్చినప్ఫుడు అన్ని ఉద్యోగసంఘాలు ప్రధానంగా సీపీఎస్ ఉద్యోగ సంఘాలు చేసిన అభ్యంతరాలపై …

Read More »

పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు : హిమాన్షు శుక్లా హామీ!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనలు సరళతరం చేసి పనిచేసే పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఎ.పి.యు.డబ్ల్యు.జే. నాయకులకు హామీ ఇచ్చారు. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకునిగా బాధ్యతలు చేపట్టిన హిమాన్షు శుక్లా ను ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర నాయకత్వ బృందం సోమవారం కలిసి అభినందనలు తెలిపింది. యూనియన్ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం , శాలువా ఇచ్చి సత్కరించారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు …

Read More »