Breaking News

Daily Archives: July 24, 2024

క్రీడలతో శారీరకదారుఢ్యం, మేధస్సు పెరుగుతుంది

-సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దారుఢ్యం, మేధస్సు కూడా పొందవచ్చని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ‘శిక్షా సప్తాహ్’ లో భాగంగా బుధవారం పటమట కేబీసీ బాయ్స్ హైస్కూల్లో మూడో రోజు జరిగిన ‘క్రీడా దినోత్సవం’ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాలీబాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్, సెపక్ తక్రా తదితర ఆటలు పరిశీలించి, విద్యార్థులతోకలిసి …

Read More »

ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం… : సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులను దోచుకొని ఉండేవారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 వ శాసన సభ సమావేశం మూడవ రోజు బుధవారం అసెంబ్లీలో నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై శాసన సభలో చర్చ సాగింది. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ల్యాండ్ టైటిలింగ్ …

Read More »

తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ….

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు …

Read More »

డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ లోని రోడ్లు డ్రెయిన్లు తాగునీటి కుళాయిలను ఆధునికరించి అభివృద్ధి చేసే బాధ్యత ను తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. జోనల్ కమిషనర్ బి రమ్య కీర్తన ఇతర అధికారులతో కలిసి బుధవారం 41వ డివిజన్లోని బ్యాంకు సెంటర్ కోళ్ల ఫారం రోడ్డు గాంధీ బొమ్మ సెంటర్ బాల భాస్కర్ రావు పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. రోడ్లు పారిశుద్ధ్య నిర్వహణ డ్రెయిన్లు …

Read More »

జీవో 217 రద్దు చేస్తూ నిర్ణయం

-మత్స్యకారుల సమస్యలు పరిష్కారిస్తాం -గత ప్రభుత్వంలో దుర్మార్గమైన నిర్ణయాలు -అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందిలో మత్స్యకారులు ప్రధానమని, అటువంటి మత్స్యకారులను గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయాలతో ఇబ్బందులు …

Read More »

ముత్తుకూరు సర్పంచిపై కుల దూషణకు పాల్పడి… సంతకాలు ఫోర్జరీ చేసినవారిపై చర్యలు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారనీ… కచ్చితంగా పంచాయతీలను బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక వర్గం ముత్తుకూరు గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి, కుల దూషణలు చేయడం, తన సంతకం ఫోర్జరీ …

Read More »

సీఎం చంద్రబాబు ప‌ట్టుద‌ల‌, కేంద్రం ప్రోత్సాహంతో రాష్ట్రం అభివృద్ధి..

-చంద్ర‌బాబు నాయుడు కృషి వ‌ల్లే కేంద్ర బ‌డ్జెట్‌లో వ‌రాలు జ‌ల్లు -రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌రత్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌నా విధానంతో రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం సానుకూల ప‌రిణామ‌మ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్ర అభివృద్ధి కోసం మ‌రిన్ని ప్రాజెక్టులు, సంస్క‌ర‌ణ‌లు …

Read More »

జులై 31న పాలిటెక్నిక్ లలో మిగిలిఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

-సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో మిగిలి ఉన్న సీట్లను పాలీసెట్ అర్హత కలిగిన, అర్హత లేని అభ్యర్థులచే అయా పాలిటెక్నక్ ల స్ధాయిలో భర్తీ చేస్తారన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖాళీ …

Read More »

స్వచ్ఛాంధ్ర హోదా సాధన దిశగా ఆంధ్ర ప్రదేశ్

-రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యాదర్శి శశిభూషణ్ కుమార్ -ఓడిఎప్, మొబైల్ ఆప్లికేషన్, సర్వే అంశాలపై హైబ్రీడ్ విధానంలో ఉన్నత స్ధాయి సమీక్ష -గ్రామ స్థాయిలో మురుగు నీటి నిర్వహణకు ప్రణాళిక : గంధం చంద్రుడు -విభిన్న పారామితులపై సమగ్ర డేటాబేస్ కోసం సర్వే : కృష్ణ తేజ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంధ్ర హోదా సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను క్షేత్ర స్దాయిలో అమలు చేసి తగిన ఫలితాలను రాబట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, …

Read More »

FCV పొగాకు అమ్మకాలకు అనుమతి

-2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో నమోదిత సాగుదారులచే ఉత్పత్తి చేయబడిన అధిక FCV పొగాకు అమ్మకాలకు అనుమతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తుపాను వర్షాల కారణంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్‌లోని రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిర్ణయం వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, 2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నమోదిత సాగుదారులు ఆంధ్రప్రదేశ్‌లోని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో సాధారణంగా వర్తించే సేవా ఛార్జీలతో ఉత్పత్తి చేసిన అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకును పొగాకుని …

Read More »