-2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని వేలం ప్లాట్ఫారమ్లలో నమోదిత సాగుదారులచే ఉత్పత్తి చేయబడిన అధిక FCV పొగాకు అమ్మకాలకు అనుమతి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
తుపాను వర్షాల కారణంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్లోని రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిర్ణయం
వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, 2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని నమోదిత సాగుదారులు ఆంధ్రప్రదేశ్లోని వేలం ప్లాట్ఫారమ్లలో సాధారణంగా వర్తించే సేవా ఛార్జీలతో ఉత్పత్తి చేసిన అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకును పొగాకుని బోర్డు వేలం ప్లాట్ఫారమ్లలో అదనపు సేవారుసుములను మాఫీ చేయడం ద్వారా విక్రయించడానికి ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని నేల ప్రాంతాలలో 15028.09 హెక్టార్ల విస్తీర్ణంలో జరిగిన పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని అదనపు సర్వీస్ ఛార్జీలు లేకుండా రైతులకు ఊరట కలిగించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 డిసెంబరు 3 నుండి 5 మధ్య కాలంలో కురిసిన “మైచాంగ్” తుఫాను వర్షాల కారణంగా రైతులు ప్రధాన పొలంలో రీప్లాంటేషన్/ఖాళీని పూరించడానికి అదనపు ఖర్చు పెట్టడం వల్ల అప్పట్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో, ఈ పంట సీజన్లో, 43125 మంది రైతులు 97127.07 హెక్టార్ల విస్తీర్ణంలో FCV పొగాకును సాగు చేసి 205.5 మిలియన్ కేజీల పంటను ఉత్పత్తి చేశారు. 2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని వేలం ప్లాట్ఫారమ్లలో నమోదిత సాగుదారులు ఉత్పత్తి చేసిన అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు అమ్మకంపై జీరో పెనాల్టీ అమలు చేయాలని తీసుకున్న ఈ నిర్ణయం తుఫాను వర్షాల వల్ల జరిగిన నష్టం నుంచి ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ రైతులు కోలుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిగణన FCV పొగాకు రైతులను ప్రకృతి వైపరీత్యాల కారణంగా వారి ఆర్థిక దుస్థితిని అధిగమించడానికి మరియు సాగుదారులు వారి జీవనోపాధిని కొనసాగించడానికి గొప్పగా సహాయపడుతుంది.
Prajavartha Online Telugu News