Breaking News

Monthly Archives: July 2024

ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాలకు 22 చివరి తేది

-రిపోర్టింగ్ పూర్తి చేయకుంటే సీటు రద్దు -సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. సీట్ల కేటాయింపు 17వ తేదీన జరిగిందని, సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను 22వ తేదీ …

Read More »

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన అనా కొణిదెల 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనా కి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అనా …

Read More »

సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌ అద్బుత ప్ర‌యోగం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-సీఎం నివాసంలో జ‌రిగిన టిడిపి పార్ల‌మెంట‌రీ స‌మావేశం -ఢిల్లీ వేదికగా జ‌గ‌న్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని వివిధ మంత్రితత్వ‌ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన ప‌లు పథకాలు, నిధుల‌ ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఎంపిలు, రాష్ట్ర మంత్రులు క‌లిసి ప‌నిచేసే విధంగా రూప‌క‌ల్ప‌న చేసిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న అద్బుత ప్ర‌యోగమ‌ని..మంచి స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. ఉండ‌వ‌ల్లి లోని సీఎం చంద్ర‌బాబు నాయుడు నివాసంలో శ‌నివారం …

Read More »

శ్రీకాళహస్తి నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి నుండి ఇంద్రకీలాద్రి పై నున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల శ్రీధర్ మరియు శ్రీ కాళహస్తి ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణా రెడ్డి మరియు అధికారులు అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా …

Read More »

శ్రీ శైలం నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు మరియు ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యముల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని …

Read More »

వాతావరణ విశేషాలు

heavy rains

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 1. నిన్నటి వాయుగుండం చిల్కా సరస్సు సమీపంలో ఒడిశా తీరంనకు ప్రయాణించి ఈరోజు అనగా 2024 జూలై 20 న ఉదయము 0 8 .30 గంటలకు గడచిన 3 గంటల్లో అదే ప్రాంతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 85.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరంగా ఉంది. ఈ వాయుగుండం పూరీ (ఒడిశా) కు నైరుతి దిశగా 40 కిలోమీటర్లు మరియు గోపాల్పూర్ (ఒడిశా) కు తూర్పు-ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై …

Read More »

పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు

-వ్యాధులు వ్యాపించకుండా మెరుగైన చర్యలు తీసుకోవాలి -భోజనం, తాగునీరు, వసతుల విషయంలో రాజీ పడొద్దు -బీసీ సంక్షేమ హాస్టళ్లలోని సదుపాయాలపై మంత్రి సవిత ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. తాగునీరు, భోజనం, వసతుల విషయంలో రాజీ …

Read More »

యువత నైపుణ్య శక్తిని పెంపొందించుకొని ఉద్యోగాల్లో రాణించాలి – దేవరపల్లి విక్టర్ బాబు.!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని శ్రీ పట్టాభి మెమోరియల్ ట్రైనింగ్ సెంటర్ ఓల్డ్ రైల్వేస్టేషన్ రోడ్డు ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ సంస్ధ మరియు జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ప్రయత్నాల్లో అవకాశం రాలేదు అని నిరుత్సాహపడకుండా తమలోని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి ఉద్యోగ మేళాలు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్రంలో అనేక సంస్థల్లో …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పారిశుధ్య సమస్యకు పరిష్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విపరీతంగా పెరిగిపోయి చెత్త చెదారం తో పాటు విషజీవులకు ఆవాసంగా మారిన మల్లికార్జున పేట ఉప్పర వాగు కొండపై పారిశుద్ధ్య సమస్యల ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది సమస్య పరిష్కరించారు. మల్లిఖార్జున పేట ఉప్పర వాగు కొండపై పారిశుద్ధ్య సమస్యతోపాటు పిచ్చి మొక్కలు పేరుకుపోయి సర్పాలతో పాటు దోమలకు నిలయంగా మారిందని స్థానికులు పశ్చిమ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి …

Read More »

డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సంద‌ర్శ‌కుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

-క‌లెక్ట‌ర్ జి.సృజ‌న అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన స్టీరింగ్ క‌మిటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ‌లోని 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సంద‌ర్శ‌న‌కు వ‌చ్చేవారికి ప‌ర్య‌ట‌న మ‌ధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని.. ఇదేవిధంగా మ‌రిన్ని సౌక‌ర్యాల‌తో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌కు సూచించారు. శ‌నివారం డా. బీఆర్ అంబేద్క‌ర్ సామాజిక న్యాయ మ‌హాశిల్పం, స్మృతివ‌నాన్ని క‌లెక్ట‌ర్ సృజ‌న సంద‌ర్శించారు. అనంత‌రం ప్రాంగ‌ణంలోని విహార మినీ థియేట‌ర్‌లో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న స్టీరింగ్ క‌మిటీ …

Read More »