Breaking News

Monthly Archives: August 2024

కృష్ణతత్వం ఆచరణీయం

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణతత్వం ఆచరణీయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలో సోమవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన పాల్గొని స్వామి వారికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గోకులాష్టమిగా, కృష్ణ జన్మాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకునే శ్రీ కృష్ణుని జన్మదినానికి పురాణ ఇతిహాసాల్లో ప్రత్యేకత ఉందన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత …

Read More »

మధర్ థెరిస్సా విగ్రహా ఆవిష్కరణ

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సేవా మూర్తి, విశ్వ మాత మధర్ థెరిస్సా విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మధురానుభూతి ని కల్పించిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నిస్వార్ధ సేవకు మారుపేరు మదర్ థెరీసా అన్నారు. విశ్వమాతగా పేరు పొందిన …

Read More »

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, …

Read More »

సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు క్షేత్రస్థాయిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా, సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన అనే వినూత్న కార్యక్రమాన్ని విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్ హాల్ నందు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. నిర్వహించారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుతున్న క్రమంలో , నేరాలు అరికట్ట డానికి తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల పై ప్రజలను చైతన్యవంతం చేయడానికి దేశం లో ఎక్కడ లేని విధంగా 200 …

Read More »

రాబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేయు ఏర్పాట్ల పరిశీలన

-నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ నగరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భక్తులు అందరూ ఆనందోత్సవాలతో శాంతి భద్రతల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయు భద్రతా ఏర్పాట్లను సోమవారం ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఇతర అధికారులతో కలిసి వినాయకుడి గుడి, అమ్మవారి టెంపుల్, ఘాట్ లను, క్యూ …

Read More »

అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన సెల్ కాన్ సీఎండీ వై.గురు

-తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకు విరాళంగా అందజేత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అన్నక్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు రూ.26.25 లక్షలను అన్నక్యాంటీన్లకు విరాళంగా అందించారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నక్యాంటీన్లలో …

Read More »

శ్రీకృష్ణుని ద‌య‌తో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి -కృష్ణ‌మందిరాల నిర్మాణానికి రాజ‌కీయాల‌కు అతీతంగా స‌హాయ‌స‌హ‌కారాలు  రాష్ట్ర గృహ నిర్మాణం; స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకృష్ణుని ద‌య‌తో రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని.. ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో ఆనందంగా జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్లు రాష్ట్ర గృహ నిర్మాణం; స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి అన్నారు. సోమ‌వారం శ్రీకృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా విజయవాడ, దుర్గాపురం, అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో …

Read More »

క్రీడాకారులతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 29వ తేదీన నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞను క్రీడాకారులతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి, డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోచ్ లు కలిసి చేయించడం జరిగింది. చురుకైన, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి నా ఫిట్నెస్, ఆరోగ్యం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయిస్తాను.. నా …

Read More »

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేయండి.

-నిధులు వృధా చేయకుండా సద్వినియోగ పరచండి. -రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా . పి నారాయణ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక సంస్థ, తుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాదాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, ఎక్కడా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పీ. నారాయణ అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ, తుడాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై తుడా సమావేశం మందిరంలో సోమవారం మంత్రి అధికారులతో సమీక్ష …

Read More »

రాజరాజేశ్వరి పేట లోని ప్రధాన ఔట్ఫాల్ డ్రైన్ పరిశీలన

-విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్ టౌన్ నుంచి రాజరాజేశ్వరి పేట మీదుగా బుడమేరు కాలువకు ప్రవహించే ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ ను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాజా రాజేశ్వరి పేట లో అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన ఔట్ఫాల్ డ్రైన్ లో వ్యర్ధాలను తొలగించాలని ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేస్తూ, ఔట్ ఫాల్ డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని వన్ టౌన్ నుండి రాజరాజేశ్వరి పేట …

Read More »