Breaking News

Daily Archives: September 18, 2024

ప్రపంచ పర్యాటక దినోత్సవ పోటీల గోడ పత్రిక ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఈనెల సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ పర్యాటక దినోత్సవ పోటీల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించి జిల్లాలో సదరు పోటీలలో ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేయాలని వాటికి బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరపతి జిల్లాలోని ప్రముఖ పర్యాటక …

Read More »

వరదబాధితుల సహాయార్థం జిల్లా యంత్రాంగం తరపున రూ.57,48,408 మెగా చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-రాష్ట్రంలోని విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో నష్టపోయిన బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆపన్న హస్తం కు తోడుగా మేము సైతం అని వరద బాధితుల సహాయార్థం తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి రూ. 84,50,193 విలువగల సాయం అందించిన తిరుపతి జిల్లా యంత్రాంగం -వరద బాధితుల సహాయార్థం ముందుగా జిల్లాలో తన నెల జీతంలో సగభాగం విరాళంగా ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ స్పూర్తితో వరద బాధితులకు పలువురి విరాళాలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో …

Read More »

తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Padmavati Puram, Tirupati) నందు 20-09- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:Govt ITI, Padmavati Puram, Tirupati,Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన నియో లింక్, కమ్యూనికేషన్స్ …

Read More »

తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో చేపట్టాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ తదితరాలు ఉన్నాయని, అలాగే పలు జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు జరుగుతుంటాయి అని, పలు పర్యాటక ప్రదేశాలు తదితరాలు ఉన్న నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జీలు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి …

Read More »

ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ కు సంబంధించి పీహెచ్సీ డాక్ట‌ర్ల డిమాండ్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ సానుకూల స్పంద‌న‌

-పీహెచ్సీ డాక్ట‌ర్ల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు అవ‌స‌రం మేర‌కు జీఓ 85 స‌వ‌ర‌ణ‌కు అంగీకారం -ప‌లు ఇత‌ర డిమాండ్ల‌ను కూడా ప‌రిశీలించేందుకు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ హామీ -ఏ స‌మ‌స్య ప‌రిష్కారానికైనా మొండిప‌ట్టు విడ‌నాడాల‌న్న మంత్రి -ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ త‌గ్గింపుపై గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే నివేదిక వ‌చ్చింద‌న్న మంత్రి -ప్ర‌భుత్వ హామీల నేపథ్యంలో పీహెచ్సీ డాక్ట‌ర్లు ఆందోళ‌న‌ను విర‌మించాల‌ని సూచ‌న‌ -ప్ర‌భుత్వం, పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం ప్రతినిధుల మ‌ధ్య సుహృద్భావ చ‌ర్చ‌లు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పీజీ వైద్య విద్య‌లో ఇన్ …

Read More »

పిల్లలను కార్మికులుగా మార్చడం చట్ట రీత్యా నేరం

-వారికి నిర్బంధ విద్య ను అమలు చేయాలి -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ మరియు ఇతర శాఖల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కార్యదర్శి ప్రకాష్ బాబు మాట్లాడుతూ 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు …

Read More »

సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో రెండు రోజులు పాటు రాజమహేంద్రవరం లో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ సి డబ్ల్యూ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మా కార్యక్రమం 19.09.2024 మరియు 20.09.2024 తేదీ లలో రాజమహేంద్రవరం లో నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా …

Read More »

“ఐ.టి.ఐ, లలో మిగులు ఉన్న సీట్లు కోసం ధరఖాస్తులు ఆహ్వానం”

-“నాల్గవ విడత అడ్మిషన్” -ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్.క్రిష్ణన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి ఉత్తీర్ణులైన మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అభ్యర్థులకు ఐ.టి.ఐ ల లో ప్రవేశం కొరకు తూర్పు గోదావరి జిల్లాలో గల ప్రభుత్వ మరియు ప్రవేట్ ఐ.టి.ఐ ల లో 2024-25 సంవత్సరమునకు గాను మిగులు ఉన్న సీట్లు కోసం “నాల్గవ విడత అడ్మిషన్స్” కొరకు ధరఖాస్తులు కోరడమైనది. అభ్యర్థులు తమ యొక్క అన్ని ధ్రువ పత్రములతో iti.ap.gov.in అను వెబ్సైట్ ద్వారా “05-09-2024 నుండి 26-09-2024 రాత్రి 11:59 …

Read More »

న్యాక్ బొమ్మూరు లో సమగ్ర శిక్షాభియాన్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ పై టీ వో టి శిక్షణ కార్యక్రమం

బొమ్మూరు/ రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బొమ్మూరు నందు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జరిగిందని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహాయ సంచాలకులు జున్నూరు రాజు తెలియ చేశారు. సోమవారం న్యాక్ కార్యాలయంలో శిక్షకులు మూడో రోజు శిక్షణ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా సహాయ సంచాలకులు వివరాలు తెలియ చేస్తూ, న్యాక్ ఆధ్వర్యంలో విద్యార్థులకి శిక్షణ అంద …

Read More »

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక వై జంక్షన్ నుండి నందంగనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛత హి సేవ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి  ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛత …

Read More »