-సమీక్షలో పాల్గొన్న స్పెషల్ సీఎస్, ముగ్గురు సీఎండీలు -వంద రోజుల్లో 12 వేల కొత్త వ్యవసాయ కనెక్షన్లు -పారిశ్రామిక, డొమెస్టిక్ అవసరాలకు నిరంతర విద్యుత్ -త్వరలోనే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వంద రోజుల పాలనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన కార్యక్రమాలు వాటి అమలుపై ఆరా తీశారు. ప్రత్యేకించి కొత్త వ్యవసాయ కనెక్షన్లు …
Read More »Daily Archives: September 19, 2024
గ్రీవెన్స్ కార్యక్రమంలో మానవత్వం చాటుకున్న మంత్రి గొట్టిపాటి
-చిన్నారి ట్రీట్ మెంట్ కు ఆర్థిక సాయం -అధికారుల అలసత్వంపై ఫిర్యాదులు… చర్యలకు వినతులు -గ్రీవెన్స్ కు పోటెత్తిన అర్జీదారులు… వినతులు స్వీకరించి పరిష్కారం చూపిన నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాలుగు సంవత్సరాలు ఉన్న తన పాపకు చిన్నమెదడు ఎదుగుదల లేదని.. కూర్చోవడం, నడవడం, మాట్లాడటం లేదని.. ట్రీట్ మెంట్ కు హైదరాబాద్ తీసుకెళ్లమని చెబుతున్నారని.. ఇప్పటికే పాప ట్రీట్ మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చుచేశామని ఇక తమ వద్ద డబ్బులు లేవని .. తమను ఆదుకొని పాప …
Read More »ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికి తిరిగి ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం అమలులో భాగంగా గృహాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ షాపులు, ఎలక్ట్రికల్ వస్తువుల అమ్మకపు …
Read More »ఘనంగా మహాకవి, పద్మ భూషణ్ డా. బోయి భీమన్న 113వ జయంతి ఉత్సవం
-రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కన్నులపండుగగా వేడుకలు -అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించిన మహాకవి, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మహాకవి, పద్మ …
Read More »బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్
– విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు – ఈ నెల 20వ తేదీ నుంచి వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ నెల 20వ తేదీ శుక్రవారం నుంచి ఈ కేంద్రం ద్వారా సేవలు పొందొచ్చని జిల్లా కలెక్టర్ …
Read More »యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
-పరీక్షకు హాజరు కానున్న 136 మంది అభ్యర్థులు… -డిఆర్వో వి. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేది శుక్రవారం నుండి 22వ తేదీ వరకు తిరిగి 28, 29 తేదీలలో ఐదు రోజుల పాటు నిర్వహించే యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లను సరిచూసుకోవాలని డిఆర్వో వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లపై గురువారం డిఆర్వో వి. శ్రీనివాసరావు నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో …
Read More »‘నిగమ’ సేవలు భేష్
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు ఆరు వస్తువులతో కూడిన కిట్లను అందజేసిన నిగమ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత కొనియాడారు. నగరంలోని భవానీ ఘాట్ స్వాతి సెంటర్ లో వరద బాధితులకు మంత్రి కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు రేయింబవళ్ళు కష్టపడి విజయవాడ వరద బాధితులను …
Read More »ట్రెండ్ కు తగ్గట్టు నేతన్నలకు శిక్షణ..
-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత -మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన మంగళగిరి వీవర్ శాలతో వందలాది మందికి లబ్ధి -చేనేతల అభివృద్ధికి కట్టుబడిన ఉన్న సీఎం చంద్రబాబు -త్వరలో విజయవాడ తరహా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు -ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేతలకు పూర్వ వైభవం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికులకు ట్రెండ్ కు తగ్గట్టు శిక్షణిచ్చి… చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ …
Read More »ఏపీకి తిరిగి ఊపిరి పోసిన కూటమి పాలన
-ఐదేళ్ల వైసీపీ అరాచకం నుంచి.. రూ.5కే కడుపు నింపే స్థితికి -ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రచారం -ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో ఆరు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలుస్తాం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ: రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి వంద రోజుల వుతున్న సందర్భంగా ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరు …
Read More »పాఠశాల విద్యార్థులకు ఆపన్నహస్తం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు వన్ టౌన్ లోని సుందరమ్మ హై స్కూల్ పాఠశాలకు గురువారం 50 కేజీల బియ్యం అందజేశారు.బాలికల పాఠశాల అయిన సుందరమ్మ హైస్కూల్ కు బియ్యం అందించి సాయం చేయాలని ప్రిన్సిపల్ రత్నకుమారి ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. పాఠశాలకు తక్షణమే బియ్యం అంద చేయాలని సుజనా ఆదేశాలు జారీ చేయగా కార్యాలయ సిబ్బంది గురువారం పాఠశాలకు వెళ్లి బియ్యం అందించారు.
Read More »