విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు వన్ టౌన్ లోని సుందరమ్మ హై స్కూల్ పాఠశాలకు గురువారం 50 కేజీల బియ్యం అందజేశారు.బాలికల పాఠశాల అయిన సుందరమ్మ హైస్కూల్ కు బియ్యం అందించి సాయం చేయాలని ప్రిన్సిపల్ రత్నకుమారి ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. పాఠశాలకు తక్షణమే బియ్యం అంద చేయాలని సుజనా ఆదేశాలు జారీ చేయగా కార్యాలయ సిబ్బంది గురువారం పాఠశాలకు వెళ్లి బియ్యం అందించారు.
Prajavartha Online Telugu News