అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Prajavartha Online Telugu News