గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కడప స్పోర్ట్స్ స్కూల్ లో 4, 5 తరగతుల అడ్మిషన్ల భర్తీకి సంబంధించి జిల్లాల నుండి రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపికలో పాల్గొనుటకు 136 (బాల బాలికలు) అర్హత సాధించారు. వారిలో 125 (బాల బాలికలు) రాష్ట్ర స్థాయి ఎంపికకు హాజరయ్యారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి ఎంపికలను శాప్ చైర్మన్ రవినాయుడు ఈరోజు ప్రారంభించి ఎంపికల ప్రక్రియను శాప్ డైరెక్టర్లు ఏ.రమణారావు, పి. రవీంద్రనాధ్, శాప్ ఏవో వెంకటరమణ నాయక్, యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పాల్ కుమార్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ పారదర్శకంగా, సమర్థవంతంగా ఎంపికల ప్రక్రియ చేపడుతున్నామన్నారు. శారీరక, మానసిక దారుఢ్యంతోపాటు క్రీడాకారులుగా రాణించాలనుకునేవారిని ఎంపిక చేయడమే అజెండా అన్నారు. ప్రతిభతోపాటు అర్హత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. సిఫారసులు, ప్రోద్భలాలకు అతీతంగా విద్యార్థుల ఎంపిక జరుగుతోందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News