తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి తనకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వాహనం ముందు అశ్వ, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారి వాహనసేవ అత్యంత వేడుకగా జరిగింది. ఈ వాహన సేవలో తుడా చైర్మన్, టీటీడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Prajavartha Online Telugu News