విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ చల్లా మౌనిక కు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కుట్టు మిషన్ అందజేశారు. బ్యాంకు సెంటర్ లో నివాసముంటున్న చల్లా మౌనిక తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేదని జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్ అందజేయాలని ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పీ 4 లో భాగంగా, సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ 5,500 విలువచేసి ఉష కుట్టు మిషన్ ను కూటమి నేతలతో కలిసి ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. చేయూతనిచ్చిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి లబ్ధిదారు చల్లా మౌనిక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీ వీ చిన సుబ్బయ్య, 42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, యంగ్ ప్రొఫెషనల్ కాకర్ల ప్రేమ్ దీప్, కూటమి నేతలు గంగవరపు సురేష్, రవి, మన్నెం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News