-స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ విభాగాల న్యూరల్ టార్నెడో
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇంగ్లిష్ విభాగం సమకాలీన ఇంగ్లిష్ సాహిత్యం, భాషా సంస్కృతులపై రెండురోజులపాటు ఈ 15, 16 తేదీల్లో కళాశాల వెబినార్ హాలులో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఆంగ్ల విభాగాధిపతి డా.శ్రీలత తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టరును వారు ఆదివారం విడుదల చేశారు. ఆసక్తి కలిగినవారు ప్రసంగపత్రాలు సమర్పించాలన్నారు. కాగా కళాశాల స్టాటిస్టిక్స్ విభాగం, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈనెల 16న నిర్వహించే న్యూరల్ టార్నెడో కార్యక్రమం పోస్టరు ఆవిష్కరణ కూడా జరిగింది. స్టాటిస్టిక్స్ విభాగాధిపతి, అకడమిక్ ఆఫీసర్ జి.చక్రవర్తి, డేటా సైన్స్ విభాగాధిపతి కె.ఉదయశ్రీ మాట్లాడుతూ స్టాట్ క్వెస్ట్, డేటా అనాలిసిస్, ప్రాజెక్ట్ ఎక్స్ పో, హ్యాక్ ఫ్యూజన్, క్రియేటివ్ ఫోటోగ్రఫీ, రీల్ మేకింగ్ తదితర పోటీలను నిర్వహించి బహుమతులు అందచేస్తామన్నారు.
Prajavartha Online Telugu News