Breaking News

ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం

-కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు ఇంట్లో విందు
-పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి , యువ నేత నారా లోకేష్
-విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని)ను ఆప్యాయంగా పలకరించిన యువ నేత, మంత్రి లోకేష్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి పార్టీ లకు చెందిన ఎంపీ లు అందరూ బుధవారం ఆత్మీయంగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో మధ్యాహ్నం జరిగిన విందులో కూటమి ఎంపీలు అందరూ పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్య, ఐటీ శాఖల మంత్రి, యువ నాయకులు నారా లోకేష్ ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై కూటమి ఎంపీలతో కలసి సందడి చేశారు. ఎంపీలందరినీ ఆప్యాయతతో పేరుపేరునా పలకరించారు. విందుకు హాజరైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) సైతం మంత్రి లోకేష్ ను కలిసి కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *