Breaking News

పాఠశాలల్లో లిప్ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రొగ్రాం) కార్యక్రమం సక్రమంగా అమలు చేయాలి

-సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడానికి మోనటరింగ్ వ్యవస్థ పటిష్టం కావాలని, సక్రమమైన కార్యాచరణ ప్రణాళిక వేయాలని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీ ప్రాంగణం ఎస్ జె సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లో జరుగుతున్న అభ్యసనా అభివృద్ధి కార్యక్రమం (ఎల్ఐపి) వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో సామర్థ్యాల సాధనకు, ఉపాధ్యాయులకు బోధనా మెళుకువలు, సాధన కృత్యాలు, బోధనా సోపానాలు వంటి అంశాల అభివృద్ధి కోసం 2022- 23 విద్యా సంవత్సరం నుండి పది జిల్లాలలో ఈ అభ్యసనా అభివృద్ధి కార్యక్రమం (ఎల్ఐపి) అమలవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం (2024 – 25) నుండి మిగతా జిల్లాల్లో కూడా విజయవంతంగా కార్యక్రమం అమలు చేయడానికి ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. కార్యశాలలో వల్లి మాణిక్యం (సిప్స్ డైరెక్టర్), ఎన్ ఉపేందర్ రెడ్డి (అడ్వైజర్ సిప్స్, అస్కి), ఎం. శ్రీనగేష్ (సేవ్ ది చిల్డ్రన్ ఎడ్యుకేషన్, దక్షిణ భారత ఇంచార్జ్), రాష్ట్రస్థాయి విషయ నిపుణుల బృందం పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక హెూదా కోసం పవన్ కల్యాణ్ పోరాడాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హెూదాతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *