అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరే గింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags AMARAVARTHI
Check Also
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా…
-అర్హులైన అందరికీ అక్రిడిటేషన్లు మంజూరు -ఏపీయూడబ్ల్యూజే నేతలకు మంత్రి పార్థసారధి హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల …