Breaking News

టీడీఆర్ బాండ్ల జారీలో ఎప్పుడూ లేనివిధంగా భారీ స్కాం

-నాలుగు పట్టణాల్లో వందల కోట్ల అక్రమాలు
-దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా భవన నిర్మాణాలకు అనుమతులివ్వండి
-ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా అధికారులు పనిచేయాలి
-రాజధాని రైతులకు త్వరలోనే కౌలు చెల్లిస్తాం
-మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కాం జరిగిందన్నారు పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ..బాండ్ల లో అక్రమాలు చూస్తే.ఇలాంటి స్కాం లు కూడా చేస్తారా అనిపించిందని అన్నారు…రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలని అన్నారు.అమరావతి సచివాలయంలో పట్టణ ప్రణాళికా విభాగంలోని అధికారులతో మంత్రి సమీక్ష చేశారు..ఈ సమీక్షకు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు..టౌన్ ప్లానింగ్ లో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఉన్న అధికారులు,ఉద్యోగులు గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు..భవన నిర్మాణాలకు అనుమతులను పూర్తిగా ఆన్ లైన్ లోనే ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.ఎన్ని అంతస్తుల భవనం అయినా ఆన్ లైన్ లో అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు మంత్రి.ఆ తర్వాత మంత్రి నారాయణ. మీడియా తో మాట్లాడారు.

టౌన్ ప్లానింగ్ విభాగంలో 2014-2019 మధ్య తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు మంత్రి.కానీ గత ఐదేళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.విశాఖపట్నం,తణుకు,గుంటూరు,తిరుపతి లో టీడిఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని మంత్రి చెప్పారు..తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక అందినదన్న మంత్రి…..నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని చెప్పారు.తణుకు లో 29 బాండ్లు జారీ చేస్తే అన్నీ అక్రమమే అని తేలిందన్నారు..బాండ్ల జారీలో ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉన్నప్పటికీ చదరపు గజాల ప్రకారం భూమి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు..ఒక చదరపు గజానికి రు.4500 ఉండగా…22,000 రూపాయల గా లెక్క కట్టినట్లు చెప్పారు.అంటే 1:200 ఇవ్వడానికి బదులు 1:400 గా ఇచ్చారని అన్నారు.స్థలం కోల్పోతున్న సమీపంలో ధర కంటే ఎక్కడో 1.4 కిమీ దూరంలో ఉన్న భూమి విలువను పరిగణనలోకి తీసుకుని బాండ్లను జారీ చేయడం అనేది ఒక పెద్ద స్కాం అని అన్నారు.తణుకులో బాండ్ల జారీలో అక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.ఎక్కడైతే బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయో అలాంటి చోట్ల ఇచ్చిన బాండ్లను నిలిపివేసినట్లు చెప్పారు మంత్రి.కోర్టుకు వెళ్లిన 300 మంది బాండ్లను మార్చుకున్నారని…గత ప్రభుత్వంలో పాలన సున్నా అనేది బాండ్ల జారీ ద్వారా నిరూపితమైంది అని అన్నారు.అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలని అన్నారు.

ఇక తిరుపతిలో కూడా రెండు టీడీఆర్ బాండ్ల లో చదరపు గజం విలువ 40,000 గా అధిక ధర చూపించడం…గుంటూరులో కూడా చదరపు గజం విలువ 9000 ఉండాల్సింది 20000 గా చూపించి బాండ్లు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు.విశాఖపట్నం లో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా నోటరీ అప్రూవల్ తో బాండ్లు జారీ చేసి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.మొత్తంగా వందల కోట్ల అక్రమాలు జరిగాయని స్పష్టం చేశారు.రాజకీయ నాయకులు చెప్పినా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బదిలీ చేస్తారనే భయంతో అధికారులు పనిచేసినట్లు మంత్రి చెప్పారు.టీడీఆర్ బాండ్ల జారీ అక్రమాల్లో నాయకులదే మొదటి తప్పు అన్నారు.టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలపై సీఎం తో చర్చించి అవసరమైతే మరికొన్ని కమిటీలు వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎన్ని అంతస్తుల భవనం నిర్మాణం అయినా అనుమతులను ఆన్ లైన్ లోనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. 15 రోజుల్లోగా దరఖాస్తు పరిశీలించి ఎక్కడైనా సమస్య ఉంటే మరోసారి అర్జీడారునికి సమాచారం ఇవ్వాలన్నారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు అయినా మంచి పేరు అయినా తీసుకురావడం లో టౌన్ ప్లానింగ్ కీలకమైందన్నారు.అందుకే ఈ విషయంలో ముఖ్యమంత్రి తనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు.

రాజధాని రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
సీఎం చంద్రబాబు అడగ్గానే భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు.త్వరలోనే రైతులకు కౌలు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.ఏ రైతునూ ఇబ్బంది పెట్టేది లేదని…గత ఐదేళ్లలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు..

కేంద్ర నిధులతో అమరావతి పనులు వేగవంతం అవుతాయి
కేంద్రం ప్రకటించిన 15 వేల కోట్ల నిధులతో అమరావతి వేగంగా ముందుకెళ్తుందని మంత్రి నారాయణ చెప్పారు.అయితే జైకా వంటి సంస్థల ద్వారా నిధులు ఇస్తున్నారని అన్నారు.ఎలాగైనా కానీ అమరావతి పనులు వేగంగా జరుగుతాయని అన్నారు మంత్రి.అమరావతిలో నిర్మాణాల పటిష్టత అధ్యయనానికి ఐఐటి చెన్నై,ఐఐటి హైదరాబాద్ సంస్థలను ఉపయోగించుకుంటున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.మరోవైపు పనులు ఎలా మొదలు పెట్టాలని దానిపై సాంకేతిక కమిటీ వేసినట్లు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *