అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు దాదాపు గంటపాటు కేంద్ర, రాష్ట్ర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. జస్టీస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును జస్టీస్ ఎన్వీ రమణ ఘన స్వాగతం పలికి సత్కరించారు.
Tags delhi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …