Breaking News

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత కె. ఎల్. నారాయణ, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, అలంకార్ ప్రసాద్, రాజా యాదవ్.

నారా చంద్రబాబు నాయుడు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇండస్ట్రీ సమస్యలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా పరిశ్రమ గురించి నిర్మాతలు అడిగి తెలుసుకున్నారు. త్యరలో వాటి గురించి వివరిస్తానని అన్నట్లు తెలిసింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *