Breaking News

పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే నగరం అందంగా ఉంటుంది

-స్వచ్ఛత హి సేవ లో మూడు వేలకు పైగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య శిబిరం
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం ఉంటేనే నగరం పరిశుభ్రంగా, అందంగా ఉంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా సఫాయిమిత్ర సురక్షసిబిర్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నిత్యం పగలు రాత్రి శ్రమించే పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సఫాయిమిత్ర సురక్ష ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలోనే కాకుండా దుర్గాపురం యూపీహెచ్ సితో పాటు 40 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మూడు వేలకు పైగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సఫయి మిత్ర సూరఖ శిభిర్ లో పారిశుధ్య కార్మికులుకు డాక్టర్లు, యూపీహెచ్ సి సిబ్బంది ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసారు. పారిశుధ్య కార్మికులుకు అవసరమైన రక్త పరీక్షలు, మధుమేహం, థైరాయిడ్, తదితర పరీక్షలు చేసి వారికి ఉచితం గా మందులు ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *