Breaking News

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం తన పర్యటనలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బుడమేరు వంతెన, పైపుల్ రోడ్, ఉడా కాలనీ, న్యూ రాజీవ్ నగర్, కండ్రిక జర్నలిస్ట్ కాలనీ, 33 తోముల రోడ్డు, ఆంధ్రజ్యోతి రోడ్డు, పి ఎన్ టి కాలనీ వాంబే కాలనీ, పైపుల్ రోడ్ జంక్షన్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని సైడ్ ట్రైన్లలో పూడికలు ఎప్పటికప్పుడు తీసివేయాలని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఊడవాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసేయాలని, రోడ్లన్నీ నీళ్లతో శుభ్రపరచాలని, నీటి నిల్వలు ఎక్కడ లేకుండా చూసుకోవాలని, ఎక్కడైనా వరదనీటి నిల్వలు ఉన్నచో వెంటనే వాటర్ పంపులతో తీసేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ, దోమలు, వాటి వల్ల కలుగు వ్యాధులను యాంటీ లార్వే ఆపరేషన్లు నిరంతరం చేస్తూ, అధికారులు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *