-చివరి తేదీ జూలై 18 సాయంత్రం ఐదు గంటల వరకు
-ఎస్ ఎస్ ఎస్ – పిడి సుభాషిణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా లో అనపర్తి , కోరుకొండ క్లస్టర్స్ పరిధిలో ఖాళీ గా ఉన్న రెండు ఫిజియో థెరపిస్ట్ పోస్టుల తాత్కాలిక ప్రాతిపదికన నియామకం కొరకు దరఖాస్తుల ఆహ్వానించడం జరుగుతుందని జిల్లా సర్వ శిక్ష అభియాన్ అధికారి ఎస్ సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫిజియో థెరపిస్ట్ .విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు లని జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం, జిల్లా విద్యా అధికారి కార్యాలయ ప్రాంగణం, కోటగుమ్మం దగ్గర, బి ఎస్ ఎన్ ఎల్ ఆఫీసు ప్రక్కన, రాజమహేంద్రవరం నందు కార్యాలయ పని వేళలు నందు 18 జులై 2024 సాయంత్రం 5.00 గంటలలోపు సమర్పించ వలసినదిగా ఆమె తెలియచేసారు.