Breaking News

తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

-తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలి
-నాయకుల కాళ్లకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దు :- సిఎం నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేసే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని…ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని….నాయకులకు కాదని అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు నేరుగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే…..తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని సీఎం అన్నారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని సీఎం కోరారు. ఆత్మగౌరవంతో అంతా నడుచుకోవాలని…కాళ్లకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *