Breaking News

పట్టిసీమ నీటిని పులిగడ్డ ఆక్విడెక్టు ద్వారా దివిసీమకు విడుదల…

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రిటిష్ వారు కూడా ప్రాధాన్యత ఇచ్చిన ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం మోపిదేవి వార్పు వద్దకు కేఈబీ ప్రధాన పంట కాలువ ద్వారా వచ్చిన పట్టిసీమ నీటిని పులిగడ్డ ఆక్విడెక్టు ద్వారా దివిసీమకు విడుదల చేసే మహోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి పట్టిసీమ నీటికి ప్రత్యేక పూజలు చేసి దివిసీమకు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నీటితో కృష్ణాడెల్టాకు సాగు, తాగునీరు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పట్టిసీమను నిర్లక్ష్యం చేసిందని, జగన్ పట్టిసీమను వట్టిసీమ అన్నారని గుర్తు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయటంతో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్ని ఖాళీగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలకులు పులిగడ్డ ఆక్విడెక్టును, లాకుల గేట్లను కూడా పట్టించుకోలేదన్నారు. కనీసం మెయింటేనేన్స్ పనులు కూడా చేయని వైసీపీ నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ లాకులు సక్రమంగా పని చేయట్లేదన్నారు. ఈ పరిస్థితిలో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు పట్టిసీమను పునరుద్దరించి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు అందించి డెల్టా రక్షకుడిగా నిలిచారన్నారు. కృష్ణా డెల్టాలో చిట్టచివరి ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గానికి చేరిన పట్టిసీమ నీటితో ముందుగా గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపి, అనంతరం వ్యవసాయానికి అందిస్తామన్నారు. అదృష్టవశాత్తూ వర్షాలు కూడా ప్రారంభం కావటం ఆనంద దాయకమన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ చంద్రబాబు ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ పాలన ముగిసే సమయానికి ఇరిగేషన్ శాఖ దగ్గర చిల్లిగవ్వ కూడా లేని దుస్థితి వచ్చిందన్నారు. గత ఐదేళ్లలో ఒక్క ఔట్ ఫాల్ స్లూయీజ్ కూడా నిర్మించక పోవటంతో కోడూరు, నాగాయలంక మండలాల్లో నాలుగు వేల ఎకరాలు సాగుకు నోచుకోలేదన్నారు. గత పాలకుల వైఫల్యంతో నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ఎదురైందన్నారు. ఈ నేపథ్యంలో తమపై గురుతర బాధ్యత పడిందన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన డ్రైనేజీలు, పంటకాలువలు సక్రమంగా పని చేసేలా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువల లాకుల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయించి వచ్చే ఏడాదికి పటిష్టమైన ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.

ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రైతులకు కష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తోందన్నారు. ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని నినాదంతో పని చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతు ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చేయటమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ముందుగా సర్ ఆర్ధర్ కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *