-తూపిలిపాలెం బీచ్ లో పర్యాటక అభివృద్ధికి చర్యలు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
గూడూరు, వాకాడు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని, తూపీలి పాలెం బీచ్ పర్యాటక అభివృద్ధి కొరకు స్థల పరిశీలన నేపథ్యంలో అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు డివిజన్ నందలి వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు రిసార్ట్స్ ఏర్పాటుకు, అలాగే వాటర్ స్పోర్ట్స్ కు సంబంధిత పర్యాటక శాఖ ప్రతిపాదనల మేరకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ మరియు పర్యాటక శాఖ అధికారులతో పరిశీలించి మాట్లాడుతూ నిబంధనల మేరకు గుర్తించిన స్థలాన్ని పర్యాటక శాఖకు కేటాయించే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్ కు సూచించారు. కలెక్టర్ సదరు బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడి ప్రజలతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు, టూరిజం డా.రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి, తహశీల్దార్ వాకాడు తదితరులు పాల్గొన్నారు.