-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎర్ర కాలువ కారణంగా వరద నీరు హెచ్చరికల నేపధ్యంలో సోమవారం జూలై 22 న జిల్లా వ్యాప్తంగా నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) మీ కోసం కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జిల్లా , డివిజన్ , మునిసిపల్ , మండల , గ్రామ స్థాయి లో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (గ్రీవెన్స్) కార్యక్రమం కూడా రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరడం జరిగింది. మండల, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించడం జరిగింది.