Breaking News

తమిళనాడు బోట్లను అడ్డుకోండి

-ఫిషరీస్ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశం
-కావలి ఎమ్మెల్యే వినతి మేరకు సమస్య పరిష్కరించిన కొల్లు రవీంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడు నుండి నెల్లూరు జిల్లా పరిధిలోని తీర ప్రాంతాలకు వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలని గనులు, భూగర్భ&ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ ను ఆదేశించారు. సచివాలయంలోని ఛాంబర్లో కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణా రెడ్డి మంత్రిని కలిసి కావలి, కోవూరు, సర్వే పల్లి నియోజకవర్గాల పరిధిలోని మత్స్యకారుల ఇబ్బందులని వివరించారు. సమస్యపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమిళనాడు నుండి భారీ పడవల్లో వస్తూ స్థానిక మత్స్యకారులకు చెందిన వలలు నాశనం చేస్తున్నారని తెలిపారు. పెద్ద పెద్ద పడవల్లో వస్తూ స్థానిక మత్స్యకార వృత్తిని దెబ్బతీస్తున్నారన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇకపై మత్స్యకారులు ఇబ్బంది పడకుండా చూడాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *