-సిసి కెమెరాల పర్యవేక్షణలో నిరంతర ఇసుక సరఫరా పై నిఘా ఉంచేలా చర్యలు..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో ప్రజలకు అవసరమైన ఇసుకను పారదర్శకంగా అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన గనులు భూగర్భ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ గనులు భూగర్భ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్కుమార్లు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి ఇసుక డిపోల నిర్వహణ, ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ డా. జి. సృజన వివరిస్తూ జిల్లాలో 6 డిపోల ద్వారా ప్రజలకు ఇసుకను పారదర్శకంగా అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని కీసర, మోగలూరు, అల్లూరుపాడు, కొడవటికల్లు, మాగల్లు, అనుమంచిపల్లి ప్రాంతాల డిపోల ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 98,868 మెట్రిక్ టన్నుల ఇసుకను నామమాత్రపు రుసుముతో విక్రయాలను నిర్వహించడం జరిగిందన్నారు. నిబంధనలను అనుసరించి సీనరేజ్ నిర్వహణ ఖర్చులతో పారదర్శకంగా అమ్మకాలు నిర్వహిస్తున్నామని ఎటువంటి అవకతవకలకు లోటుపాట్లకు తావులేకుండా ఉండేందుకు ఆరు డిపోల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఇసుక లోడిరగ్ విధానంలో జాప్యం లేకుండా త్వరితగతిన లోడిరగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సీనరేజ్, లోడిరగ్ రేట్లకు సంబంధించిన పట్టిక ప్లెక్సీలను అన్ని డిపోల వద్ద ఏర్పాటు చేసి డిజిటల్ చెల్లింపులతో మాత్రమే విక్రయాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గనులు, భూగర్భ శాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ల పర్యవేక్షణలో నిరంతర నిఘాతో పారదర్శకంగా ప్రజలకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ డా.జి.సృజన ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీన, ఆర్డివోలు బిహెచ్ భవాని శంకర్, ఏ. రవీంద్రరావు, గనులు భూగర్భ శాఖ డిప్యూటి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏడి వీరాస్వామి, ఇరిగేషన్ ఇఇ కృష్ణారావు, నందిగామ ఏసిపి డా. రవికిరణ్ పాల్గొన్నారు.